నృసింహ ద్వాదశి విశిష్టత! వ్రత విధానం 2021!
![]() |
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి! |
ద్వాదశి అంటే?
సంస్కృతంలో ద్వాదశి అంటే 12 అని అర్ధం. అంటే 12వ దినం అని. ఈ ద్వాదశులు కృష్ణపక్షం ఒకటి మరియు శుక్లపక్షం ఒకటి ప్రతినెలలో వస్తాయి. కాబట్టి ఈ ద్వాదశులు సంవత్సరాయికి 12 కృష్ణపక్షం ద్వాదశులు మరియు 12 శుక్లపక్షం ద్వాదశులు వస్తాయి.
ఈ ద్వాదశులనాడు వివిధ విష్ణు అవతారాలను పూజిస్తారు.
నృసింహ ద్వాదశి అంటే?
అయితే ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాడు నరసింహ అవతారంలో ఉన్న విష్ణు రూపాన్ని పూజిస్తారు కనుక ఈ ద్వాదశిని నరసింహ ద్వాదశి పిలువబడుతుంది.సహజంగా నరసింహ ద్వాదశి హోలీ పండగ ముందు వస్తుర్నది.
నృసింహద్వాదశి తేదీ?
ఈ సంవత్సరం నృసింహ ద్వాదశి 25/03/2021 న జరుపుకుంటారు.
నృసింహ ద్వాదశి విశిష్టత!
నరసింహ స్వామి ఎవరైతే నరసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని పండితుల మాట. ఈ వ్రతమాచరించే భక్తులకు స్వామివారు ధైర్యాన్ని, నమ్మకాన్ని మరియు భద్రతను కల్పిస్తారని నమ్మకం. అందుచే భక్తులు నరసింహస్వామి రోజంతా ఉపవాసముండి, స్వామివారి శ్లోకాలు వళ్ళిస్తూ ధ్యానము చేసి విశేషంగా లబ్ది పొందుతారు.
నృసింహ ద్వాదశి వ్రత విధానం :
- వేకువఝామునే నిద్రలేవాలి.
- పారే నదిలో లేదా చెరువులో కానీ లేదా నూతి వద్దకాని శిరస్నానమాచరించటం మంచిది. పారే నదిలో స్నానమాచరిస్తే దేహశుద్ది జరుగుతుందని పూజపై మనస్సు లగ్నమవుతుందని పెద్దలమాట.
- నరసింహస్వామి దేవాలయంలో కానీ లేదా ఇంటివద్ద పటం వద్దకాని వివిధరకాల పూలు, పండ్లు ఉంచి నరసింహస్వామి శ్లోకాలను భక్తి శ్రద్దలతో చదువుతూ పూజ చేయాలి.
- నరసింహ స్వామివారికి తులసిమాలతో అలంకరించి, వడపప్పు, పానకం నైవేద్యంగా.సమర్పించాలి.
- కనీసం "ఓం నమో నృసింహయ నమః" అని 108 సార్లు స్వామి వారిని ధ్యానించి విశేష ఫలితం లభిస్తుంది.
- "నరసింహయ్య విద్మహే, వజ్రనఖాయ ధీమహి తనః సింహః ప్రచోదయాత్" అని నరసింహాగాయత్రిని జపించిన మంచి జరుగుతుంది.
- "ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖం| నృసింహం భీషణం భద్రం|| మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం|||" ఈ మంత్రాన్ని జపిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
- అలాగే ఈరోజు శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రాన్ని, నరసింహ అష్టోత్తరాన్ని, నరసింహ సహస్రనామాలను పఠిస్తే చాలామంచిదని పురాణాలూ చెబుతున్నవి.
No comments:
Post a Comment