రామలక్ష్మణ ద్వాదశి 2025
మన పురాణాలు, వేదాలను ఉటంకిస్తూ ఋషులు, మునులు ప్రజాప్రయోజనార్ధం కొరకు ఎన్నో రకాల వ్రతాలను మన ముందుంచారు. వాటిలో సంతానం లేనివారి కొరకు ఓ గొప్ప వ్రతాన్ని మనకు తెలిజేశారు. త్రేతాయుగంలో వసిష్ఠ మహర్షి దశరధ మహారాజుతో సంతానం కొరకై చేయించిన మహోన్నత వ్రతం ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతం.
ఎప్పుడు చేయాలి ?
జ్యేష్టమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు వసిష్ఠ మహర్షి దశరధ మహారాజు తో నిష్ఠాగరిష్టలతో రామలక్ష్మణ ద్వాదశి వ్రత విశిష్టతను వివరించి ఆచరింప చేసారు. దశరధ మహారాజు నిర్మలమైన మనసుతో నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన పది మాసాలకు శ్రీరాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులైన నలుగురు పుత్ర సంతానం జన్మించారు.
2025లో జూన్ నెల 7వ తారీఖున రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి .
ఎవరు చేయాలి ?
వ్రతాన్ని ఎలా ఆచరించాలి ?
పుత్రసంతానం కోరుకొనే వారు రామలక్ష్మణ ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా నదీ ప్రవాహంలో కానీ, తటాకంలో కానీ, బావివద్ద కానీ శిరస్నానమాచరించాలి. శుచి ఐన వస్త్రధారణ చేసుకోవాలి.
పిదప ఇంట్లో రామలక్ష్మణుల పటాన్నుంచి రామలక్ష్మణులను శక్తి కొలది భక్తితో ప్రార్ధ్దించాలి. రామలక్ష్మణుల అష్టోత్తరాలను మరియు రామాయణంలోని కొన్ని లేదా అధ్యాయాలను పఠించడం చేయాలి.
వ్రత ఫలితం :
సంతానలేమితో బాధపడేవారు ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించినచో పుత్రసంతానం కలుగుతుందని పెద్దల మాట.
రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించినవారికే కాకుండా చూచినవారికి కూడా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో వివరించిబడినట్లు చెబుతుంటారు.
ఒడిశాలో అయితే ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని చంపక ద్వాదశి వ్రతముగా పూరీ జగన్నాధస్వామి ఆలయంలో విశేషముగా జరుపుకొంటారు.
No comments:
Post a Comment